Friday 20 January 2017

ఇంట్లో ఎలాంటి లక్ష్మీ దేవి ఫోటోలు ఉంటే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?/ Lakshmi Pooja

ఇంట్లో ఎలాంటి లక్ష్మీ దేవి ఫోటోలు ఉంటే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
గుడ్లగూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే ఫోటోను కానీ, లేదా విగ్రహాన్ని కానీ పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుందట.

తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటోను ఇంట్లో ఎట్టిపరిస్థితిలో పెట్టుకోకూడదు. తామర పువ్వులో కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. అష్టఐశ్వర్యం సిద్ధిస్తుందట.

గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచే జరుగుతుంది.

శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న ఫోటోను లేదా విగ్రహాన్ని పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట.

లక్ష్మీదేవికి అనుగ్రహం పొందిన కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట.

పాదరసంతో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట.

శ్రీయంత్రం గురించి తెలియని వారుండరు. ఇంట్లో ఎలాంటి కష్టనష్టాలు జరగకుండా, ధన ధాన్యంతో సంవ్రుద్దిగా ఉండాలని, ఇంట్లో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మనీ లాకర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.

లక్ష్మీ పూజ చేసేటప్పుడు విష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పువ్వులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది నెరవేరుతుందట.

దీపావళి రోజున లక్ష్మీ దేవితో పాటు, కుబేరున్ని పూజించి తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా మంత్ర జపం చేయడం వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుందట.

ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా🌹🌹🌹🌹

Thanks to

No comments:

Post a Comment