Tuesday 29 May 2018

శ్రీ మహావిష్ణువుకు అమితంగా ఇస్టమైనది...

సాధారణంగా ఆలయదర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తూ  ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే చెప్పాడు.
పూర్వం గూడకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళబుచ్చేవాడు.. గూడకేశుడు విష్ణువుభక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. 
ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చెయ్యాలని  అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తప్పస్సుని మెచ్చిన విష్ణువుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావలో  కోరుకోమన్నడు. అందుకు గూడాకేశుడు, తనకు ఏమీ అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణువుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణువుచక్రం వల్ల మాత్రమే ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యడు. గూడకేశుడు సంతోషించాడు.
విష్ణువుమూర్తి అనుగ్రహించిన అనంతరం గూడకేశుడు తపస్సు చేస్తున్నే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికెను తీహాలని  విష్ణువుమూర్తి నిర్ణయించుకుని,మిట్టమధ్యానపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేర్తుందా అని ఎదురు చుస్తున్న గూడకేశుడు మిక్కిలి సంతోషించాడు.
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెఎంటనే  అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గూడకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి.
రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు . అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవెద్యం సమర్పించతం వెనుక ఇంత కథ ఉంది.
సత్యనారయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర !కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలాగ ఒక్కొక్క దేవత కు ఒక్కొక్క ప్రసదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కుడా మనకి తెలియని విషయాలు  ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివెదన చేసి  మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణపరబ్రహ్మం ఎప్పుడు లోకక్షేమమే కద చూస్తాడు ..లోకసమస్త సుఖినో భవంతూ !!!!!!!